Namaste NRI

అమెరికా నివేదికపై.. భారత్‌ తీవ్ర అభ్యంతరం

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ లో జాతుల మధ్య ఘర్షణల అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘన లు చోటు చేసుకున్నాయని ఇటీవల అమెరికా ఓ నివేదిక విడుదల చేసింది. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అది పూర్తిగా పక్షపాతంగా ఇచ్చారని దుయ్యబట్టింది. దానికి ఎలాంటి విలువ లేదని స్పష్టం చేసింది. మీడియా సమావేశంలో విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఈ అంశా న్ని ప్రస్తావించారు.  ఆ నివేదిక పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నది. భారత్‌ ను ఎంత తప్పుగా అర్థం చేసుకు న్నారో దీంతో అర్థమవుతోంది. దీనికి మేం ఎలాంటి విలువ ఇవ్వడం లేదు.  మీరు కూడా ఇవ్వొద్దు అని వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events