Namaste NRI

అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి .. కథ విషాదాంతం

అమెరికాలో గత ఆదివారం అదృశ్యమైన భారతీయ విద్యార్థి నీల్‌ ఆచార్య కథ విషాదాంతమైంది. నీల్‌ మృతదేహాన్ని అతడు చదువుతున్న యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్‌ క్లిఫ్టన్‌ ధ్రువీకరించారు. నీల్‌ ఆచార్య  ఇండియానా రాష్ట్రం లోని పర్డ్యూ విశ్వవిద్యాలయం లో చదువుతున్నాడు. అయితే, ఆదివారం యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అతడు అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని అతడి తల్లి ఆదివారం నుంచి తన కొడుకు కనిపించడం లేదని, అతడిని గుర్తించడంలో సాయం చేయండంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. చివరిసారిగా ఉబర్‌ డ్రైవర్‌ నీల్‌ను క్యాంపస్‌లో వదిలిపెట్టినట్లు తెలిపారు. ఈ పోస్ట్‌పై స్పందించిన షికాగోలోని భారత రాయబార కార్యాలయం వర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అ మేరకు విద్యార్థిని గుర్తించడంలో అవసరమైన సహాయ సహకారాల్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నీల్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events