Namaste NRI

వీసా అవసరం లేకుండానే భారతీయులు….  తమ దేశంలోకి    

థాయిలాండ్‌కు వెళ్లే భారతీయులకు అక్కడి ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రత్యేకంగా వీసా అవసరం లేకుండానే థాయ్‌లాండ్ అందాలను చుట్టి రావచ్చు. సాధారణ పాస్‌పోర్టు ఉన్నవారు అక్కడ గరిష్ఠంగా 30 రోజుల పాటు పర్యటించవచ్చు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్, తైవాన్ దేశాల నుంచి వచ్చేవారు వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు నవంబరు 10, 2023 నుంచి అనుమతిచ్చింది. ఈ గడువు మే 10, 2024తో ముగుస్తోంది. ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలు ఇస్తుండడంతో ఈ వెసులుబాటును మరో ఆరు నెలల పాటు పెంచుతున్నట్టు రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయించింది. నవంబర్ 11, 2024 వరకు ఇది వర్తిస్తుంది.

అంతకు ముందు ఈ పథకం ద్వారా కేవలం 15 రోజులు మాత్రమే అక్కడ ఉండడానికి వీలుండేది. చైనా, రష్యా, భారత్, దక్షిణ కొరియా, మలేసియా, దేశాల నుంచి థాయిలాండ్‌కు భారీ సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు. ఈ దేశాల టూరిజం మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని థాయ్ ప్రభుత్వం వీసా నిబంధనలను సడలిస్తోంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 1.2 కోట్ల విదేశీ పర్యాటకులు థాయిలాండ్‌లో పర్యటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events