Skip to main content

Namaste NRI

ఇరానీ ఛాయ్ లాంటి చిత్రమిది 

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భాగ్‌ సాలే. ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకుడు. వేదనీష్ క్రియాటివ్ వర్క్స్ బ్యానర్ లో అర్జున్ దాస్యన్, యాష్ రాగినేని, కళ్యాణ్ నిర్మించారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, హర్ష చెముడు, జాన్ విజయ్, వర్షిణి, నందిని రాయ్, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.   క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ  సినిమా ట్రైలర్‌ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ భాగ్‌ సాలే అనే సౌండింగ్‌లోనే ఓ ఫన్‌ క్రియేట్‌ అవుతుంది. ఇది పూర్తిగా హైదరాబాద్‌ నేపథ్యంలో నడిచే కథ. సికింద్రాబాద్‌, వారాసిగూడ, పాతబస్తీలో చిత్రీకరణ జరిపాం అన్నారు.

ఈ సినిమాలో అర్జున్‌ అనే ఓ టక్కరి దొంగ పాత్రలో కనిపిస్తానని, ఓ విలువైన ఉంగరం దొరకడం వల్ల అతని జీవితంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయనేది ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని శ్రీసింహా కోడూరి తెలిపారు. నిర్మాత అర్జున్‌ దాస్యన్‌ మాట్లాడుతూ క్రైమ్‌ కామెడీ తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన జోనర్‌. హైదరాబాద్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో చక్కటి వినోదంతో ఈ చిత్రం ఆకట్టుకుంటుంది అన్నారు. కాగా, జులై 7న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో ప్రియదర్శి, నందినీ రాయ్, అర్జున్ దాస్యన్, కాలభైరవ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events