
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్ చేరుకున్నారు. బెన్ గురియన్ విమానాశ్రయంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు స్వగతం పలికారు. ఇరు దేశాల నేతలు గౌరవ వందనం స్వీకరించారు.ప్రధాని మోదీ ఇజ్రాయెల్ లో పర్యటించడం ఇది రెండవ సారి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఇజ్రాయెల్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఇప్పటి వరకూ ఏ భారత ప్రధాని ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించలేదు. గాజా పరిస్థితులతోపాటు , పశ్చిమ ఆసియాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది మరియు అక్కడి ప్రవాస భారతీయులను కలిసి మాట్లాడే అవకాశం ఉంది.
















