Namaste NRI

భారతీయులకు నో చాన్స్‌.. 2028 వరకు అనుమతి నిరాకరణ

అమెరికా డైవర్సిటీ వీసా (డీవీ) లాటరీ నుంచి భారతీయులను 2028 వరకు అమెరికా మినహాయించింది. ఈ డీవీ లాటరీని గ్రీన్‌ కార్డు లాటరీగా కూడా వ్యవహరిస్తారు. గడచిన ఐదు సంవత్సరాలకు పైగా అమెరికాకు తక్కువ సంఖ్యలో ప్రజలు వలస వచ్చిన దేశాల నుంచి అందిన దరఖాస్తులలో 50,000 మంది వరకు ఈ ప్రోగ్రామ్‌ కింద ఇమిగ్రెంట్‌ వీసాలను అమెరికా మంజూరు చేస్తుంది. అయితే భారత్‌ ఈ పరిమితిని దాటేసింది. భారతీయులకు మంజూరైన ఇమిగ్రెంట్‌ వీసాల సంఖ్య గడచిన ఐదేళ్లుగా పరిమితికి మించి ఉండడంతో 2028 వరకు భారతీయులకు ఈ లాటరీ ద్వారా వీసాలు పొందే అర్హతను కోల్పోయారు.

గడచిన ఐదేళ్లలో 50,000కు మించి ఇమిగ్రెంట్లను అమెరికాకు పంపిన కారణంగా డీవీ లాటరీ నుంచి భారత్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. 2021లో 93,450 మంది భారతీయులు అమెరికాకు వలసలు పోగా 2022లో ఈ సంఖ్య 1,27,010కి పెరిగింది. 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస పోయారు. భారత్‌తోపాటు చైనా, దక్షిణ కొరి యా, కెనడా, పాకిస్థాన్‌ను కూడా డీవీ లాటరీ నుంచి తప్పించే అవకాశం కనపడుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events