Skip to main content

Namaste NRI

ముందస్తు ముచ్చట లేదు.. సరైన సమయంలోనే

పాకిస్థాన్‌లో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికలకు వెళ్తారని, అందుకే ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. పూర్తి కాలం పదవిలో ఉండేందుకే  పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నిశ్చయించుకున్నారని సమాచారం. వచ్చే యేడాది ఆగస్టుతో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తుంది. అప్పటి వరకూ ప్రధాని పదవిలో ఉండాలనే షెహబాజ్‌ షరీఫ్‌ నిశ్చయించుకున్నారు. మధ్యంతరం కాకుండా, పూర్తి కాలం ప్రభుత్వంలో ఉండాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా దేశంలోని రాజకీయ వాతావరణాన్ని కూడా చర్చించారు.

Social Share Spread Message

Latest News