Namaste NRI

దక్షిణ కొరియాలో జనాభా సంక్షోభం.. బిడ్డను కంటే!

దక్షిణ కొరియాలో జనాభా సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో దేశంలో జనన రేటును పెంచేందుకు ప్రభు త్వం చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతి బిడ్డకు జన్మనిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా 59 వేల పౌండ్లు(దాదాపు రూ.61 లక్షలు) నగదు ఇచ్చే విషయాన్ని సర్కార్‌ పరిశీలిస్తున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమాన్ని అమలు చేసే ముందు ఒక పబ్లిక్‌ సర్వేను నిర్వహిస్తున్నది. దక్షిణ కొరియాలో జననాల రేటు భారీగా పడిపోయింది.

2023లో ఇది 0.72కు తగ్గింది. అంటే దేశంలోని ప్రతి మహిళ ఒక్క బిడ్డకు కూడా జన్మనివ్వట్లేదు అన్నమాట. 2023లో నమోదైన జాతీయ జనన రేటు దేశ చరిత్రలోనే అత్యంత కనిష్ఠం. దేశంలో జనాభా సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. పెరిగిన జీవన వ్యయం, తగ్గిన జీవన నాణ్యత, వెరసి దంపతులు వివాహ బంధానికి, పిల్ల లను కనేందుకు విముఖత చూపుతున్నారు. జనన రేటును పెంచేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events