Namaste NRI

ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీ కువైట్‌ అత్యున్నత గౌరవ పురస్కారం ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌ను అందుకున్నారు. విదేశాల అత్యున్నత నాయకులకు, రాజ కుటుంబాల సభ్యులకు స్నేహానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందిస్తారు.  రెండు రోజుల పర్యటన నిమిత్తం కువైట్‌ చేరుకున్న మోదీకి బేయన్‌ ప్యాలెస్‌లో సైనిక వందనం లభించింది. కువైట్‌ అమీర్‌(దేశాధినేత) షేక్‌ మెషల్‌ అల్‌-అహ్మద్‌ అల్‌-జబర్‌ అల్‌-సబహ్‌ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 43 ఏండ్లలో భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే ప్రథమం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events