Namaste NRI

రష్మిక మందన రెయిన్‌బో ప్రారంభం

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా రెయిన్‌బో. దేవ్‌ మోహన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కథతో దర్శకుడు శాంతరూపన్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అమల అక్కినేని క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమరా స్విచాన్ చేయగా, సురేష్ బాబు స్క్రిప్ట్ అందించారు.  నిర్మాతలు మాట్లాడుతూ ఒకే ఒక జీవితం  సినిమా తర్వాత మేము తెలుగులో నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్నారు.  ప్రతిభ గల నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఆకట్టుకునేలా సినిమాను నిర్మిస్తాం. ఈ నెల 7వ తేదీ నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు. దర్శకుడు శాంతరూపన్‌ మాట్లాడుతూ ఈ కథను అంగీకరించిన రష్మికకు థాంక్స్‌. ఈ సంస్థలో ఎలాంటి వైవిధ్యమైన చిత్రాలు నిర్మితమయ్యాయో చూశాం. ఈ సినిమా కూడా వాటి తరహాలోనే కొత్తగా ఉంటుంది  అన్నారు.

నాయిక రష్మిక మందన్న మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ ఆకట్టుకుంది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది  అని చెప్పింది. నటుడు దేవ్‌ మోహన్‌ మాట్లాడుతూ తెలుగులో నా మొదటి సినిమా శాకుంతలం  విడుదలకు సిద్ధమవుతున్నది. ఇంతలోనే మరో మంచి ప్రాజెక్ట్‌ దక్కినందుకు ఆనందంగా ఉంది  అని అన్నారు. కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 7 నుండి ప్రారంభం కానుంది.  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కే.ఎం. భాస్కరన్‌, సంగీతం : జస్టిన్‌ ప్రభాకరన్‌.


Social Share Spread Message

Latest News