దుబాయిలో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. గత నెలలో కురిసిన కుండపోత వానను మరువకముందే, మరోసారి దుబాయిని వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాదు రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకం కలిగింది. దుబాయి నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. పలు విమానా లను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాల కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు జాతీయ అత్యవసర సంక్షోభ, విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. గత నెలలో కురిసిన కుండపోత వర్షంతో పోలిస్తే తాజా వర్షాల తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సంస్థ హెచ్చరించింది. ఏప్రిల్ 14-15 తేదీలలో కురిసిన భారీ వర్షానికి యుఎఇ వణికిపోయింది. 1949 తర్వాత ఇంతటి భారీ స్థాయిలో దుబాయ్లో వర్షం పడడం ఇదే మొదటిసారి. యుఎఇ వ్యాప్తంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో దుబాయ్ విమానాశ్రయంలో విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేశారు.
