న్యూఢిల్లీలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో ఆయన నివాసంలో సీఎం శ్రీ వైయస్ జగన్ భేటీ అయ్యారు. గంటపాటు సాగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం, రెవెన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు, కడప స్టీల్ ప్లాంట్ కు గనుల కేటాయింపు అంశాలపై చొరవ చూపాలని కోరుతూ సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రధానికి వినతిపత్రం అందించారు.