ఉక్రెయిన్, రష్యా మధ్య పోరు విషయంలో జర్మనీ తప్పుడు నిర్ణయం తీసుకుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ నాటోతో చేరిన జర్మనీ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ను క్యాన్సిల్ చేసిందన్నారు. ఈ నిర్ణయం జర్మనీదేనని స్పష్టం చేశారు. జర్మనీ చేసిన తప్పునకు ఆ దేశ ప్రజలు, వ్యాపారాలు, వారి ఆర్థిక వ్యవస్థ మూల్యం చెల్లించుకుంటోంది. ఎందుకంటే ఆ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన నెగిటివ్ ప్రభావాలు చూపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల జర్మనీనే కాదు, పూర్తిగా యూరోజోన్ అంతా ఇబ్బందులు పడుతోందన్నారు.














