అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం. ఆనంది కథానాయికగా నటిస్తుంది. ఏ.ఆర్. మోహన్ దర్శకుడు. రాజేష్ దండా నిర్మాత. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను ఈ నెల 11న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో హీరో నరేష్ అడవిలో గిరిజనులతో కలిసి నడుస్తూ కనిపిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ గిరిజనుల సమస్యల్ని చర్చించే చిత్రమిది. మారుమూల ప్రాంతమైన మారేడుపల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ గిరిజనుల కష్టాల్ని చర్చిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాం అని తెలిపారు. ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమటోగ్రఫీ: రాంరెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సంభాషణలు: అబ్బూరి రవి, నిర్మాణ సంస్థలు: హాస్య మూవీస్, జీ స్టూడియోస్, రచన`దర్శకత్వం: ఎ.ఆర్.మోహన్.














