Namaste NRI

గ్రాండ్‌గా ఎర్రర 500  ట్రైలర్‌ లాంచ్‌

జస్వంత్‌ పడాల, నక్షత్ర త్రినయని జంటగా ఎన్‌.సాందీప్‌ మైత్రేయ తెరకెక్కించిన చిత్రం ఎర్రర్‌500. యు.బాలరెడ్డి నిర్మించారు. త్రినాథ్‌ శర్మ, రాజీవ్‌ కనకాల, సంజయ్‌ స్వరూప్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య, హీరో ఆకాష్‌ పూరి ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్నారు. వీఎన్‌ ఆదిత్య మాట్లాడుతూ ట్రైలర్‌ బ్రిలియంట్‌గా ఉంది. అలాగే ఎర్రర్‌ 500 అనేది జెస్సీకి యాప్ట్‌ టైటిల్‌. ఈ సినిమా రిలీజ్‌ ప్లాన్‌ గురించి సాందీప్‌ని అడిగినప్పుడు సంతోషం సురేష్‌గారు చూశారని చెప్పారు.  వెంటనే సినిమా సేఫ్‌ హ్యాండ్స్‌లో ఉందని చెప్పాను అన్నారు.  ఈ సందర్భంగా హీరో జస్వంత్‌ మాట్లాడుతూ ఓ వినూత్నమైన కథతో ఈ చిత్రం రూపొందించాం. దీనికోసం మేమంతా చాలా కష్టపడ్డాం. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరికీ తప్పకుండా నచ్చుతరుది అన్నారు. జస్వంత్‌కు సినిమాలంటే చాలా ఇష్టం. ఎంతో అంకిత భావంతో ఈ చిత్రం చేశాడు. ట్రైలర్‌లానే సినిమా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది అన్నారు చిత్ర దర్శకుడు. ఈ కార్యక్రమంలో రవి, సోహెల్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News