చైనాతో వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకోవడంపై నీతి ఆయోగ్ మాజీ చైర్మన్ అరవింద్ పనగరియా హెచ్చరికలు జారీ చేశారు. చైనాతో వాణిజ్య బంధాన్ని తెగదెంపులు చేసుకుంటే భారత ఆర్థిక వృద్ధి రేటును త్యాగం చేయడమేనని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో చైనాతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో పనగరియా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నది.














