Skip to main content

Namaste NRI

జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా పీవీ సింధు సరికొత్త చరిత్ర

భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం, పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికపై మరోసారి తన సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆతిథ్య జపాన్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించింది. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఆదివారం జరిగిన ఫైనల్‌లో పీవీ సింధు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. తొలి పాయింట్ నుంచే దూకుడుగా ఆడిన ఆమె.. చిరకాల ప్రత్యర్థి యమగుచికి పెద్దగా అవకాశాలు ఇవ్వకుండా 21-17, 21-17 తేడాతో వరుస సెట్ల లో విజయం సాధించింది. మొత్తం 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రతి గేమ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగినప్పటికీ.. కీలక సమయంలో సింధు తన అనుభవాన్ని ప్రదర్శించి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో పీవీ సింధు కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. జపాన్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ షట్లర్‌గా చరిత్రలో నిలిచింది.

Social Share Spread Message

Latest News