Namaste NRI

జెలెన్‌స్కీతో  ప్రధాని మోడీ సమావేశం

ఉక్రెయిన్‌ వివాదానికి శాంతియుత పరిష్కార మార్గానికి భారత్‌ తన శక్తి మేరకు అన్ని విధాలా ప్రయత్నిస్తుం దని, శాంతికి సంభాషణ , దౌత్యం  మాత్రమే మార్గమని ఉక్రేనియన్‌ అధ్యక్షుడు వ్లాదిమర్‌ జెలెన్‌స్కీతో  ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. ఇటలీలోని అపులియా ప్రాంతంలో జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోడీ, జెలెన్స్కీని కలిశారు. భారతదేశం మానవ-కేంద్రీకృత విధానాన్ని విశ్వసిస్తుందని కూడా ప్రధాన మంత్రి జెలెన్స్కీకి చెప్పారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి, స్విట్జర్లాండ్‌లో జరగనున్న శాంతి సదస్సుపై ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.

Social Share Spread Message

Latest News