తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 12 స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 16న నోటిపికేషన్ జారీ చేస్తారు. 23వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 26వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. డిసెంబరు 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.














