వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీని నిర్వహించే వేదికలను ఐసీసీ అధికారులు ఖరారు చేశారు. మొత్తం 7 నగరాల్లో మ్యాచ్లు జరగనుంది. అక్టోబర్ 16 నుంచి 13 వరకు ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 45 మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందుకు బ్రిస్బేన్, అడిలైడ్, గీలాంగ్, హోబార్ట్, పెర్త్, సిడ్నీ, మెలోబోర్న్ నగరాలను వేదికలుగా అధికారులు ప్రకటించారు. ఫైనల్స్ మ్యాచ్ కు మెల్బోర్న్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సెమీ ఫైనల్స్ సిడ్నీ, ఆడిలైడ్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఐసీసీ టోర్నీల పర్యవేక్షకుడు క్రిస్ టెట్లీ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరగనున్న టీ 20 ప్రపంచకప్ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)