Namaste NRI

సుస్వర తరంగ్ హీరోగా మూవీ ప్రారంభం

ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ తనయుడు సుస్వర తరంగ్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. సురవి విజన్స్‌ ప్రొడక్షన్‌ పతాకంపై వీరేష్‌ కోకా దర్శకత్వంలో పి.చక్రధర రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దివ్యాని మొండల్‌ కథానాయికగా నటిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు డాలీ క్లాప్‌నిచ్చారు.

నేటి యువతరం ఆలోచనల్ని ప్రతిబింబించే కథాంశమిదని, ఈ సినిమా ద్వారా తమ అబ్బాయికి మంచి పేరొస్తుందనే నమ్మకం ఉందని వందేమాతం శ్రీనివాస్‌ అన్నారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. అన్ని కమర్షియల్‌ అంశాలుంటాయి. హైదరాబాద్‌, వైజాగ్‌లలో చిత్రీకరణ జరుపుతాం అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: యస్‌.చంద్రశేఖరన్‌, సంగీతం: బిబిన్‌ అశోక్‌, దర్శకత్వం: వీరేష్‌ కోకా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events