భారత వైద్య పరిశోధకుడు డాక్టర్ సుభాష్ బాబును ప్రతిష్ఠాత్మకమైన బెయిలీ కె ఆష్ఫర్డ్ పతకం వరించింది. ఉష్ణమండల వ్యాధులకు సంబంధించి ప్రపంచంలోని అతిపెద్ద శాస్త్రీయ సంస్థ అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్ ఈ మేరకు ప్రకటించింది. అలాగే ఫెలో ఆఫ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్ అవార్డుకూ ఆయనను ఎంపిక చేసింది. ఈ పురస్కారానికి ఒక భారతీయుడు ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఉష్టమండల ప్రాంత వ్యాధులపై పరిశోధనలకు గాను సుభాష్కు ఈ గౌరవం దక్కింది. చెన్నైలోని ఐసీఈ ఆర్`ఇండియా సంస్థలో సైంటిఫిక్ డైరెక్టర్గా ఆయన వ్యవహరిస్తున్నారు.














