సింగపూర్కు చెందిన ఓ మహిళ అరుదైన ఘనత సాధించింది. సింగపూర్ నుంచి అంటార్కిటికాకు నాలుగు ఖండాలు దాటి 30 వేల కిలోమీటర్లు ప్రయాణించి వినియోగదారుడికి ఫుడ్ డెలివరీ చేసింది. ప్రపంచంలోనే అతి సుదూర ప్రాంతానికి ఫుడ్ డెలవరీ చేసిన వ్యక్తిగా మానసా గోపాల్ చరిత్ర సృష్టించారు. సింగపూర్ నుంచి హ్యాంబర్గ్, బ్యూనస్ ఎయిర్స్, ఉషుయా మీదుగా మానసా గోపాల్ అంటార్కిటికాకు చేరుకుంది. వాగులు, వంకలు, మంచుకొండలు దాటుతూ చివరికి తన కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేసింది. సింగపూర్ ఫుడ్ను అందుకున్న కస్టమర్ ముఖంలో ఆనందం తనకు సంతృప్తిని ఇచ్చిందని మానసాగోపాల్ తెలిపారు.














