Namaste NRI

అమెరికా పౌర హక్కుల నేత ఇక లేరు

ప్రముఖ పౌర హక్కుల నేత, డెమోక్రాటిక్‌ అధ్యక్ష నామినేషన్‌ కోసం రెండుసార్లు పోటీ పడిన జెస్సీ జాక్సన్‌ మృతి చెందారు. జెస్సీ జాక్సన్‌(84) నోబెల్‌ బహుమతి గ్రహీత, అమెరికాలో జాతి వివక్షపై ఉద్యమించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ సన్నిహిత సహచరునిగా పేరొందారు. ఆయన 2017 నుంచి పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్నారు. 1984, 1988లో ఆయన డెమోక్రాటిక్‌ అధ్యక్ష నామినేషన్‌ కోసం పోటీపడ్డారు. షికాగోకు చెందిన ఆయన పౌర హక్కుల సంఘాలైన ఆపరేషన్‌ పుష్‌, నేషనల్‌ రెయిన్‌బో కూటమిని స్థాపించారు.

Social Share Spread Message

Latest News