Namaste NRI

భారత్ కు అమెరికా హెచ్చరిక

చాబహార్ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఇరాన్ తో వ్యాపార లావాదేవీలు జరిపే దేశాలపై ఆంక్షలు విధించడానికి వెనుకాడబోమని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ ఈ డీల్ గురించి ప్రస్తావించారు. ఇరాన్ తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశమైనా ఆంక్షలు ఎదుర్కోక తప్పదు అని వేదాంత్ స్పష్టం చేశారు. మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం నెరపడానికి చాబహార్ పోర్టు భారత్ కు ప్రధాన మార్గంగా ఉంది. ఈ ఓడరేవులో 10 ఏళ్ల పాటు టర్మినల్ నిర్వహణ విషయంలో భారత్, ఇరాన్ సోమవారం ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events