Namaste NRI

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో…మరో భారతీయుడు

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని  రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసే ఓ భారతీయుడు మృతిచెందారు.

యునైటెడ్‌ నేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్‌ దవాఖానకు వెళ్తుండగా దాడి జరిగింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తున్నది. ఆయతో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి భారత్‌కు చెందిన మాజీ సైనికుడని తెలుస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events