
అమెరికాలోని యుటా రాష్ట్రంలో హైదరాబాద్లోని టోలీచౌకికి చెందిన సోహైల్ ఉద్దీన్(38)పై ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. ఉపాధి కోసం అమెరికా వెళ్లిన సోహైల్, భార్య, ఇద్దరు పిల్లలతో రెండేళ్లుగా యుటా రాష్ట్రంలోని సాల్ట్లేక్ కౌంటీలో నివాసముంటున్నారు. వెస్ట్వ్యాలీ సిటీలోని ఓ మాల్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 14న విధుల్లో ఉన్న సమయంలో మాల్కు వచ్చిన ఓ దుండగుడు నువ్వు ఇండియన్వే కదా అంటూ విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. స్థానికులు సోహైల్ను రక్షించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు నిందితుడిని పట్టుకొని అరెస్టు చేశారు. టోలిచౌకిలోని సోహైల్ ఇంట్లో అతని తల్లి మాత్రమే ఉంటున్నారు. ఈ ఘటనపై అధికారులు, బాధితుడి కుటుంబీకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత కాన్సులేట్ పేర్కొంది.





























