Skip to main content

Namaste NRI

అమెరికా లో భారతీయుడికి 22 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలో ఓ భారతీయుడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. నాలుగు వేల మంది అమెరికన్లను కోటి డాలర్లకు (సుమారు రూ.72.47 కోట్లు) మోసం చేశాడు. దీంతో అమెరికా కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. షెహ్జాద్‌ ఖాన్‌ (40) అనే వ్యక్తి అహ్మదాబాద్‌లో ఓ కాల్‌ సెంటర్‌ నిర్వహించేవాడు. దాని నుంచి అమెరికన్లకు ఆటోమేటెడ్‌ రోబో కాల్స్‌ చేయించేవాడు. ఎఫ్‌బీఐ అధికారులమని, డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని, సోషల్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులమని చెప్పి వారిని బెదిరించేవాడు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, జరిమానాలు కట్టాలని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. ఆ నేరం కోర్టులో నిరూపణ కావడంతో జైలు శిక్ష పడిరది. ఈ కేసులో ఆరుగురు నిందితుల్లో శిక్షపడిన నాలుగో వ్యక్తి షెహ్జాద్‌.

Social Share Spread Message

Latest News