నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్లు కలిసి నటిస్తున్న మరో చిత్రం 18 పేజిస్. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చర్స్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి. బన్నీవాసు నిర్మాత. ల్లు అరవిందన సమర్పణకులు. ఈ చిత్రంలో నన్నయ రాసిని అనే లిరికల్ వీడియోను ఈ నెల 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. అగ్ర దర్శకుడు సుకుమార్ రాసిన కథతో రూపొందుతున్న సినిమా ఇది. డిసెంబర్ 22న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : శరణ్ రాపర్తి, అశోక్ బండ్రెడ్డి.














