అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్బర్గ్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జులై 27 నుంచి 30వ తేదీ వరకు మహా సుదర్శన యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గణపతి హోమం, పుష్ఫ యాగం, గరుడ వాహన సేవ నిర్వహించారు. పిట్స్బర్గ్ పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఆలయ నిర్వహణ అధికారులు, బోర్డు సభ్యులు, ఈసీ సభ్యులు భక్తులకు, స్పాన్సర్లకు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భక్తి కార్యక్రమాలతో ఆలయ పరిసరాల్లో ఆద్యాత్మికత వెల్లివిరిసింది.














