Skip to main content

Namaste NRI

మానవ హక్కుల పరిరక్షకులకు నోబెల్ శాంతి

మానవ హక్కుల పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమాలకు నోబెల్ కమిటీ అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. బెలారస్ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బియాల్యాస్కీ(60), రష్యా మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రెయిన్ సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ కు సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. రష్యా`ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల్లోని సంస్థలు ప్రపంచ ప్రతిష్టాత్మక బహుమానానికి ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పుతిన్ పుట్టినరోజు రష్యా, ఉక్రెయిన్ సంస్థలకు శాంతి బహుమతి ప్రకటించడం గమనార్హం.

Social Share Spread Message

Latest News