మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల (55) భారత ప్రభుత్వ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషన్ను అందుకొన్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్రప్రసాద్ నుంచి ఆయన ఈ అవార్డును స్వీకరించారు.ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 17 మంది పద్మభూషణ్ పురస్కారాలను ప్రకటించిన విషయం విదితమే. వారిలో సత్య నాదెళ్ల ఒకరు. వచ్చే ఏడాది జనవరిలో భారత్లో పర్యటిస్తానని నాదెళ్ల తెలిపారు.














