Namaste NRI

అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు…ఆ రోజే యాత్ర ప్రారంభం

జమ్ముకశ్మీరులోని అమరలింగేశ్వరుని దర్శించుకోవాలనుకునే భక్తులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన 540 శాఖలు ఈ ప్రక్రియను ప్రారంభించాయి. అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 29నుంచి ఆగస్టు 19 వరకు 52 రోజులపాటు జరుగుతుంది. సముద్ర మట్టం నుంచి 3,880 మీటర్ల ఎత్తులోని మంచు కొండల్లో అమరలింగేశ్వరుడు కొలువై ఉన్న సంగతి తెలిసిందే. అమరనాథ్‌ దేవస్థానం బోర్టు ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తుంది. దక్షిణ కశ్మీరులోని అనంత్‌నాగ్‌లో ఉన్న పహల్గామ్‌ మీదుగా 48 కిలోమీటర్లు ప్రయాణించి అమర్‌నాథ్‌కు చేరుకోవచ్చు. మధ్య కశ్మీరులోని గండేర్‌బల్‌ జిల్లాలో ఉన్న గండేర్‌బల్‌ మార్గంలో 14 కి.మీ. ప్రయాణించి కూడా అమరలింగేశ్వరుని దర్శించుకోవచ్చు.

Social Share Spread Message

Latest News