దుబాయిలో ఈ నెల 16న తెలుగుదేశం పార్టీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించనుంది. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు యూఏఈ తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు కరామా ప్రాంతంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు, గల్ఫ్ టీడీపీ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. గల్ఫ్ టీడీపీ కమిటీ కమిటీ ఆధ్వర్యంలో నేతలకు ఘనంగా స్వాగతం పలకనున్నట్టు తెలిపారు.














