రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా రూపొందుతున్నది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్లు నిర్మిస్తున్నారు. రామ్చరణ్కు జోడిగా కియారా అద్వానీ, అంజలిలు నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాట కోసం 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 12 రోజుల పాటు చిత్రీకరించే ఈ పాట కోసం అంత భారీ ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. శంకర్ చిత్రాల్లో భారీతనం గురించి ప్రేక్షకులకు తెలిసిందే. సన్నివేశాలే కాదు పాటల చిత్రీకరణ కూడా ఘనంగా ఉంటుంది. ఖరీదైన సైట్స్, అరుదైన లొకేషన్స్, గ్రాఫిక్స్తో ఈ దర్శకుడు గతంలో పాటల చిత్రీకరణ జరిపారు. మరి రామ్ చరణ్ చిత్రంలో ఆయన ఎలాంటి తరహా పాట రూపొందిస్తున్నారు. ఆ పాటకు 15 కోట్ల రూపాయల ఖర్చు ఎలా అయ్యిందనేది మున్ముందు తెలియనుంది. పొలిటికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. ఇందులో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.














