
ఇరాన్ చర్చలకు దిగి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలకే రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. హొర్ముజ్ జలసంధిలోని మూడు అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. జలసంధిలో గస్తీ కాస్తున్న నౌకలపై దాడులు చేసింది. రెండు దేశాల పరస్పర దాడుల్లో భారత్కు చెందిన ఒక సరుకు రవాణా నౌక గురువారం రాత్రి హొర్ముజ్ జలసంధి వద్ద మునిగిపోయింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. గుజరాత్లోని ద్వారకా జిల్లా సాలయకు చెందిన ఈ రవాణా నౌకలో ఇంజిన్ రూమ్లో పనిచేస్తున్న అల్తాప్ తలాబ్ కేర్ ఈ ప్రమాదంలో మరణించగా, మిగిలిన 17 మంది నౌకా సిబ్బందిని రక్షించారు. ఈ విషయాన్ని ఇండియన్ సెయిలింగ్ వెస్సల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆడమ్ భాయ్ వెల్లడించారు.





























