Namaste NRI

అగ్రరాజ్యం కీలక నిర్ణయం.. 1.2 ట్రిలియన్ డాలర్ల బిల్లుకు

అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో దెబ్బతిన్న దేశాన్ని మళ్లీ నిలబెట్టడంలో భాగంగా తయారు చేసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బిల్లుకు అమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది. 1.2 ట్రిలియన్‌ డాలర్ల ఈ బిల్లును సెనేట్‌ సభ్యులు 69`30 ఓట్ల తేడాతో గెలిపించారు. ఈ బిల్లుకు మిచ్‌ మెకానెల్‌ సహా పలువురు రిపబ్లికన్‌ అభ్యర్థులు కూడా మద్దతిచ్చారు. ఇలా రెండు పార్టీలూ కలిసి ఒక బిల్లుకు ఆమోదం తెలపడం అరుదే. ఈ నిర్ణయం అమెరికాకు చాలా మేలు చేస్తుందని సెనేట్‌లో మెజారీటీ పక్షనేత చక్‌ షూమర్‌ అన్నారు. ఈ బిల్లుపై ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా మాట్లాడుతూ సాధ్యమైనంత తర్వగా సెనేట్‌ ఈ బిల్లును తన టేబుల్‌ మీదకు పంపాలని చెప్పారు.

Social Share Spread Message

Latest News