పి.సత్య రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వలో నిర్మించిన చిత్రం ఉక్కు సత్యాగ్రహం. మేఘన లోకేష్, గద్దర్, ఎం.వి.వి. సత్యనారాయణ, అయోధ్య రామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధానంగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమా కోసం రచయత సుద్దాల అశోక్ తేజ్ రాసిన గీతాన్ని చిత్ర బృందం హైదరాబాద్లో విడుదల చేసింది. ఈ సందర్భంగా నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదలు చేస్తుంటే దాన్ని ఈ రోజున ప్రైవేటీకరణ చేయడం న్యాయమా? ఈ అంశంపైనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ సినిమాని తీవారు సత్యారెడ్డి. రాజకీయా పార్టీలు ఈ ప్రైవేటీకరణను ఆపాలి అన్నారు. ఈ సమస్య కేవలం విశాఖపట్నం ప్రజలది మాత్రమే కాదు. మన తెలుగు ప్రజలందరిదీ. తెలుగు వారంతా ఏకమైతేనే ప్రైవేటీకరణను ఆపగలరని నమ్ముతున్నా అన్నారు గద్గర్. ఈ కార్యక్రమంలో గద్గర్, వేణుగోపాల చారి, సత్యారెడ్డి, బెక్కం వేణుగోపాల్, దర్శకుడు త్రినాధ్రావ్ నక్కిన, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తదదితరులు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.














