Namaste NRI

స్విట్జర్లాండ్‌లో అమెరికా -ఇరాన్‌ ప్రతినిధులు సమావేశం

పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అమెరికా-ఇరాన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ సంతకం చేశారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా ఒప్పందంపై సంతకం చేశారని ఆయన కార్యాలయం తెలిపింది. హొర్ముజ్‌ జలసంధి తక్షణమే తెరుచుకుంటుందని పేర్కొన్నది. జీ7 శిఖరాగ్ర సమావేశం అనంతరం వెర్సైల్స్‌ ప్యాలెస్‌లో జరిగిన విందులో ట్రంప్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ నేపథ్యంలో నేడు స్విట్జర్లాండ్‌లో అమెరికా -ఇరాన్‌ ప్రతినిధులు సమావేశం కానున్నారు. స్విట్జర్లాండ్‌లోని బుర్గెన్‌స్టాక్ పర్వత ప్రాంత రిసార్ట్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. అందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఒప్పందంపై డిజిటల్‌ సంతకాలు పూర్తి కాగా నేటి ఇరు దేశాల సమావేశం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events