Namaste NRI

భారత్ – పాక్‌కు అమెరికా సూచన

పెహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడిని భారత్‌తోపాటు అమెరికా సహా ప్రపంచ దేశాలు ముక్తఖంటంతో ఖండించాయి. పెహల్‌గామ్‌ ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు చెత్తపనిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడి ఘటనపై అమెరికా తాజాగా మరోసారి స్పందించింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాలని యూఎస్‌ విదేశాంగ శాఖ సూచించింది.

పెహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో భారత్‌కు వాషింగ్టన్‌ అండగా ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. పరిస్థితిని చక్కదిద్దేలా బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరు దేశాలు కలిసి పని చేయాలని మేం ప్రోత్సహిస్తున్నాం అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events