పెహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడిని భారత్తోపాటు అమెరికా సహా ప్రపంచ దేశాలు ముక్తఖంటంతో ఖండించాయి. పెహల్గామ్ ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు చెత్తపనిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ దాడి ఘటనపై అమెరికా తాజాగా మరోసారి స్పందించింది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాలని యూఎస్ విదేశాంగ శాఖ సూచించింది.

పెహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో భారత్కు వాషింగ్టన్ అండగా ఉంటుంది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. భారత్-పాక్ మధ్య నెలకొన్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. పరిస్థితిని చక్కదిద్దేలా బాధ్యతాయుతమైన పరిష్కారం కోసం ఇరు దేశాలు కలిసి పని చేయాలని మేం ప్రోత్సహిస్తున్నాం అని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
