Skip to main content

Namaste NRI

భారతీయ యువకులకు యంగ్ ఎకో పురస్కారం

పర్యావరణ సవాళ్లను పరిష్కరించే చొరవ చూపినందుకు ఐదుగురు భారతీయ యువకులకు 2023 అంతర్జాతీయ యంగ్ ఎకోహీరో అవార్డ్ లభించింది. అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ యాక్షన్ ఫర్ నేచర్  ఈ యువకులను గుర్తించింది.  మీరట్‌కు చెందిన ఎయిహ దీక్షిత్, ముంబైకి చెందిన కర్ణవ్ రస్తోగి, బెంగళూరుకు చెందిన మాన్యహర్ష, న్యూఢిల్లీకి చెందిన నిర్వాణ్ సొమనీ, మన్నత్ కౌర్  అవార్డు విజేతలుగా వచ్చారు.  ఇండిపెండెంట్ జడ్జిలు, పర్యావరణ శాస్త్ర , బయోలజీ, విద్యారంగ నిపుణులతో కూడిన ప్యానెల్ వీరిని విజేతలుగా నిర్ణయించింది. అత్యంత క్లిష్టమైన వాతావరణ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ సంస్థ 8 నుంచి 16 ఏళ్ల పిల్లలను, యువకులను గత ఇరవై ఏళ్లు గా ప్రోత్సహిస్తోంది.

Social Share Spread Message

Latest News