ఆపరేషన్ గంగ ద్వారా ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను వేగంగా తరలిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఢిల్లీ విమానాశ్రయంలో కిషన్ రెడ్డి స్వాగతం పలికారు.
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లకు రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.