
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు ఆటా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్నారు. డాలస్ విమానాశ్రయంలో ఆటా ప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా ప్రవాస తెలుగు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, యువ నాయకులతో రామచందర్రావు సమావేశమైనట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.





























