దేవరాజ్, సోనాక్షి వర్మ జంటగా మదు గోపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బుల్లెట్ సత్యం. లక్ష్మీ నారాయణ సమర్పణలో సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దేవరాజ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సినిమా ట్రైలర్ని ప్రముఖ నటుడు వినోద్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ దేవరాజ్కు ఇది మొదటి సినిమా అయినా హీరోగా, నిర్మాతగా చక్కగా చేశాడు. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రాజకీయ నేపథ్యం ఉన్న పాత్ర చేశాను అన్నారు. మా సినిమా రియలిస్టిక్గా ఉంటుంది. యాజమాన్య మంచి సంగీతం అందించారు అన్నారు హీరో, నిర్మాత దేవరాజ్. ఒక ఎంపీటీసీ స్థానం కోసం ఎలా పరితపిస్తారు? ఆ పదవి కోసం హీరో జీవితంలో ఏం కోల్పోయాడు? ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే చిత్రకథ అన్నారు మధు గోవు. ప్రసాద్శర్మ, శంకర్, అభిలాష్ రెడ్డి తదితరులు ఈ వేడుకకి అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చలాకీచంటి, ధన్రాజ్, గీత రచయిత రాంబాబు గోసాల తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)