
ప్రస్తుతం బాలీవుడ్ పాన్ ఇండియా మూవీ రామాయణ లో సీతాగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మణిరత్నం సినిమాకు కూడా ఈ అందాలభామ ఓకే చెప్పింది. కాకపోతే తండేల్ తర్వాత తెలుగులో ఏ కథనూ సాయిపల్లవి ఓకే చెయ్యలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు తిరుమల కిశోర్ ఇటీవలే సాయిపల్లవికి ఓ కథ వినిపించారట. మహిళా ప్రధానంగా సాగే ఈ కథలో, దైవిక శక్తులు, పురాణాల టచ్ కూడా ఉందట. కథలోని భావోద్వేగాలు, పాత్ర ప్రాధాన్యత సాయిపల్లవిని ఆకట్టుకున్నాయని, ఈ ప్రాజెక్ట్పై ఆమె సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తున్నది. ఇక దీనిపై సాయిపల్లవి నుంచి అధికారికంగా గ్రీన్సిగ్నల్ వస్తే, ఇతర నటీనటులు, నిర్మాతల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.





























