Namaste NRI

భారత్ లో ఒమిక్రాన్ ఆందోళన.. ఒకరోజులోనే

భారత్‌లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఓ వైపు డెల్టా వేరియంట్‌ నుంచి ప్రపంచ దేశాలు బయటపడకముందే ఒమిక్రాన్‌ రూపంలో దాడి జరుగుతుండటం కలకలం రేపుతోంది. దేశంలో ఇప్పటికే 26 ఒమిక్రాన్‌ కేసులు నమోదవ్వగా తాజాగా మరో 6 కేసులు నమోదయ్యాయి. ఈ ఆరు కేసులు మహారాష్ట్రలోనే వెలుగు చూడటం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32కు చేరింది.  దేశ వ్యాప్తంగా 23 ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు ఉండగా, కొత్తగా 9 పాజిటివ్‌లు నమోదయ్యాయి. గుజరాత్‌ 2, మహారాష్ట్ర 6, గుజరాత్‌లో ఇద్దరు, మహారాష్ట్రలో ఏడుగురు ఒమిక్రాన్‌ బారిన పడ్డారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events