పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరిహర వీర మల్లు కోసం బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె యువరాణిగా సందడి చేయనున్నట్టు సమాచారం. నర్గీస్ ఫక్రీ త్వరలోనే సెట్లో అడుగుపెడతారని తెలుస్తోంది. మొఘలాయిల కాలం నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా యుద్ద విద్యల్లో తర్ఫీదు కూడా పొందారు. ఆయన ఇందులో ఓ బందిపోటుగా కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన టీజర్ హరిహర వీరమల్లుపై అంచనాల్ని పెంచింది. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం తొలుత ప్రకటించిన విడుదల తేదీ వచ్చే ఏడాది ఏప్రిల్ 29.
