Skip to main content

Namaste NRI

అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలో ఈ ఘటన చోటు చేసుకుకున్నది. బ్రిడ్జ్‌వాటర్‌ కాలేజీలో ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఆ కాలేజీలో సెక్యూర్టీ ఆఫీసర్లుగా చేస్తున్న పోలీస్‌ ఆఫీసర్‌ జాన్‌ పెయింటర్‌, క్యాంపస్‌ సేఫ్టీ ఆఫీసర్‌ జేజే జెఫర్సన్‌ను హతమార్చాడు. క్యాంపస్‌లో ఓ అనుమానాస్పద వ్యక్తి తిరుగుతున్నట్లు తొలుత పోలీసులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. పోలీసులు అక్కడికి వెళ్లడంతో ఆ అనుమానితుడు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో కాలేజీ సెక్యూర్టీ పోలీసులు మృతి చెందారు. ఆ ఆర్ట్‌ కాలేజీలో సుమారు 1800 విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పులు జరిపిన నిందితుడిని 27 ఏళ్ల అలెగ్జాండర్‌ వాయత్‌ క్యాంప్‌బెల్‌గా అనుమానిస్తున్నారు.  ప్రస్తుతం అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. రాకింగ్‌హోమ్‌ కౌంటీ జైలులో అతన్ని బంధించారు. 

Social Share Spread Message

Latest News