Skip to main content

Namaste NRI

భారత్‌తో కలిసి పనిచేయడానికి తాము రెడీ

శ్రీలంక ప్రధానిగా రణీల్‌ విక్రమ సింఘే పదవీ బాధ్యతలు చేపట్టారు. తమ దేశం ఇబ్బందుల్లో వున్న సమయంలో భారత్‌ తమకు సహాయం చేసిందని, అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని  విక్రమ సింఘే తెలిపారు.  భారత్‌తో తాను సన్నిహిత సత్సంబంధాలనే కోరుకుంటున్నానని, ఆ దిశగానే పని చేస్తానని ప్రకటించారు.  ప్రజాస్వామ్య బద్దంగా, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము కూడా రెడీ ఉన్నామని భారత్‌ స్పందించింది. శ్రీలంక ప్రజానీకానికి అవసరమైన సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది.

Social Share Spread Message

Latest News