విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణ మన పేరుతో దేశభక్తి ప్రధాన చిత్రం తెరకెక్కుబోతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఖారారు చేసినట్లు తెలిసింది. కథ నచ్చడంతో పాటు పాన్ ఇండియా సినిమా కావడంతో పూజాహెగ్డే వెంటనే అంగీకారం తెలిపిందని అంటున్నారు. విజయ్ దేవరకొండ సరసన ఆమెకిది తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కించబోతున్నారు.














